ARTICLE AD
Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాల విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేస్తున్నారు.

జోరు వానలు..కరెంటుతో జర భద్రం!
తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షం దాటికి జనం అవస్థలు పడుతున్నారు. చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో... విద్యుత్ పట్ల జాగ్రత్లగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కరెంట్ తీగల సమీపానికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. విద్యుత్ అత్యవసర పరిస్థితి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయాలని చెబుతున్నారు.

Bengali (Bangladesh) ·
English (United States) ·